సహకారం అందించడం బాధ్యతగా భావించాలి శాసనసభ్యులు సుజనా చౌదరి

0

 సహకారం అందించడం బాధ్యతగా భావించాలి

శాసనసభ్యులు సుజనా చౌదరి

పశ్చిమ లోని వరద బాధితుల సహాయార్థం శాసనసభ్యులు సుజనా చౌదరి పిలుపుమేరకు సుజనా ఫౌండేషన్, రౌండ్ టేబుల్ ఇండియా, మరియు ఎస్బిఐ కార్డ్స్, దీపక్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు బుధవారం సుమారు 1400 మందికి సరిపడా నిత్యవసర సరుకులను పశ్చిమ నియోజకవర్గ వరద బాధితులకు అందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై తమ వంతు బాధ్యతగా వరద బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. వరదలు తగ్గినప్పటికీ  సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలను అభినందించారు. అనంతరం బాధితులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు, కూటమి నాయకులు మైలవరపు కృష్ణ, లింగం శివప్రసాద్, బోమ్ము గోవింద లక్ష్మి, కొనికి కొండయ్య, పగడాల కృష్ణ ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version