రూ.24 లక్షల‌ ఎల్.ఓ.సీ అంద‌జేత‌..విజ‌య‌వాడ ప‌శ్చిమ‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో

0

*రూ.24 లక్షల‌ ఎల్.ఓ.సీ అంద‌జేత‌..విజ‌య‌వాడ ప‌శ్చిమ‌ ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను బుధవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 46వ డివిజన్ సాయిరాం ప్రాంతానికి చెందిన కర్నాటి వెంకట దుర్గారావు (45) లివర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లివర్ మార్పిడి నిమిత్తం మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలుపగా ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి రూ. 24 లక్షల ఎల్‌ఓసీని ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి బాధితుడి భార్య కర్నాటి లక్ష్మికి అందజేశారు. రాజకీయాలకతీతంగా త్వరితగతిన ఎల్.ఓ.సి మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి కర్నాటి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు దాడి అప్పారావు, దీటి ప్రభుదాస్, బాదర్ల శివ, పచ్చవ మల్లికార్జున, గడ్డిపాటి కిరణ్, సప్పా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version