రాష్ట్రంలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (NDB) ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల అభివృద్ధిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

0

అమరావతి,
12.06.25.

రాష్ట్రంలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (NDB) ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల అభివృద్ధిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

• నేడు విజయవాడలోని ఆర్ & బీ శాఖ ఈఎన్ సీ కార్యాయలంలో NDB రహదారుల అభివృద్ఢి పనుల పురోగతిపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో NDB ప్రతినిధులు, ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం..

• మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆర్ & బీ శాఖ ఈ ఎన్ సీ నయిముల్లా, ఏపీఆర్డీసీ ఎండీ శ్రీనివాసరెడ్డి, NDB ప్రతినిథులు, ఇతర ఉన్నతాధికారులు..

• వచ్చే ఏడాది చివరి నాటికి NDB రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఒక నిర్ధిష్ట ప్రణాళికతో సాగాలని అధికారులకు మంత్రి ఆదేశం..

• NDB కింద ఇప్పటి వరకు రూ. 637.76 కోట్ల మేర పనులు పూర్తి కాగా రూ. 488.30 కోట్ల మేర వ్యయం చేయడం జరిగింది.. వచ్చే ఏడాది NDB రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం…

• ఈ సమీక్షా సమావేశంలో జిల్లాల వారీగా NDB రోడ్ల పనుల పురోగతిపై వివరాలను అధికారులను ఆరా తీసిన మంత్రి..

• కొన్ని జిల్లాలో NDB రోడ్ల అభివృద్ధి పనులు ఆలస్యం కావడానికి కారణాలు అడిగి తెలుసుకున్న మంత్రి… జాప్యానికి కారణాలు తెలుసుకుని, ఆయా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి..

• అదే సమయంలో NDB నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడ జాప్యం జరుగుతుందని అధికారులను ప్రశ్నించిన మంత్రి

• రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కావడానికి నిధులు కొరత తలెత్తకుండా.. NDB నుంచి నిధులు తెచ్చుకోవడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశం..

• ఈ సందర్భంగా NDB ప్రతినిధులను శాలువాతో సన్మానించి, శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేసిన సత్కరించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో NDB పనులు జరుగుతున్న తీరుపై సంతోషం వ్యక్తం చేసిన NDB ప్రతినిధులు..

గత 10 నెలలుగా రాష్ట్రంలో NDB రహదారుల పనుల అభివృద్ధిలో గుర్తించదగిన పురోగతి ఉందంటూ ఆనందం వ్యక్తం చేసిన NDB ప్రతినిధులు..

మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ & బీ శాఖ NDB పనులను తిరిగి చేపట్టి పనుల పురోగతిలో కీలకంగా వ్యవహారించిదన్న NDB ప్రతినిధులు..

ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ & బీ శాఖ ఈ ఎన్ సీ నయిముల్లా, ఏపీఆర్డీసీ ఎండీ శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version