మధురానగర్ జంక్షన్ నుంచి బానునగర్ చివరి వరకు) త్రాగునీటి పైపు లైను ₹42.08 లక్షల వ్యయం తో పనులకు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి

0

 04-12-2024 

ధి:04-12-2024  బుధవారం ఈరోజు ఉదయం 9:30″గం లకు”28వ డివిజన్ భానూనగర్ సర్వీస్ రోడ్డు (మధురానగర్ జంక్షన్ నుంచి బానునగర్ చివరి వరకు) త్రాగునీటి పైపు లైను ₹42.08 లక్షల వ్యయం తో పనులకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి

ప్రారంభించడం జరిగినది…

ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ:-త్రాగునీటి సమస్య కు శాస్వత పరిష్కారం కనుగొనే దిశగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి,త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి శంకుస్థాపన చేయడం జరిగినది అని, కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, సెంట్రల్ నియోజకవర్గంలో రాబోవు కాలంలో అనేక అభివృద్ధి పనులు ముఖ్యంగా రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, కమ్యూనిటీ హాల్లు ప్రజల ప్రాథమిక అవసరాల మీద దృష్టి పెట్టామని తెలియజేశారు

నియోజకవర్గంలో శుద్ధమైన నీరు పరిశుభ్రమైన  కుళాయి ద్వారా స్వచ్చమైన త్రాగునీరు, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా డ్రైనేజి వ్యవస్థ శుభ్రం చేయడం వంటి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం అని, నియోజకవర్గ అభివృద్దే ప్రధాన ధ్యేయంగా శ్రమిస్తు ముందుకు సాగుతాం అని బొండా ఉమ తెలియజేసారు…

ఈ కార్యక్రమంలో:-కార్పొరేటర్ వీరమాచినేని లలిత,జోగినాయుడు, పవన్,

సోమినాయుడు,ద్వారక, రామారావు ,రామ్, యేసు, నాగరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version