పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. సోమవారం కరాచీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ను ఓడించి ఇస్లామాబాద్ మూడో సారి టైటిల్ గెలుచుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి ఇస్లామాబాద్ విజయం సాధించడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌలర్ ఇమాద్ వసీం 5వికెట్లు తీశాడు.
ఆ తర్వాత 160 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ను న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ అర్ధ శతకం (50) తో విజయం దిశగా నడిపించాడు. చివరలో ఆ జట్టు బౌలర్ నసీం షా (17) మెరుపు బ్యాటింగ్తో ఇస్లామాబాద్ విజయం సాధించింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్ షదాబ్ ఖాన్కు దక్కింది.
Spread the love ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం నిందితుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేశారు. గతరాత్రి ఆయన ‘జైభీమ్ భారత్’ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర […]
Spread the loveనవ్యాంధ్రకు నూతన శకం ఆరంభం సీఐఐతో శ్రీకారం ఫలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రి నారా లోకేష్ కృషి… భారీ పెట్టుబడులతో ప్రభుత్వం ఖుషి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు […]