పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) తొమ్మిదో సీజన్ విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. సోమవారం కరాచీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ను ఓడించి ఇస్లామాబాద్ మూడో సారి టైటిల్ గెలుచుకుంది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి ఇస్లామాబాద్ విజయం సాధించడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌలర్ ఇమాద్ వసీం 5వికెట్లు తీశాడు.
ఆ తర్వాత 160 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ను న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ అర్ధ శతకం (50) తో విజయం దిశగా నడిపించాడు. చివరలో ఆ జట్టు బౌలర్ నసీం షా (17) మెరుపు బ్యాటింగ్తో ఇస్లామాబాద్ విజయం సాధించింది. ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అలాగే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డ్ షదాబ్ ఖాన్కు దక్కింది.
Spread the loveరూ.₹3,31,254 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన-MLA బొండా ఉమ ధి:-6-11-2025 గురువారం సాయంత్రం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ పరిధిలోని […]
Spread the loveఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 10, 2025 చట్టబద్ధ దత్తత ఒక వరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా ఈ ఏడాది నవంబర్ నెలలో దత్తతకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. […]
Spread the love జిల్లా కేంద్రంలో భారీగా నగదు రు. 1,99,97,500/- పట్టివేత కదిరి తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పేరున ఉన్న వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు…సీజ్ […]