టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మళ్లీ కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన అశ్విన్… టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకున్నాడు.
ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు అశ్విన్ కెరీర్ లో 100వ టెస్టు. ఈ మ్యాచ్ లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తమ్మీద ఈ ఐదు టెస్టుల సిరీస్ లో అశ్విన్ 26 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
ఇక, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా, హేజెల్ వుడ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా కగిసో రబాడా, ప్యాట్ కమిన్స్, నాథన్ లైయన్, రవీంద్ర జడేజా, ప్రభాత్ జయసూర్య, జేమ్స్ ఆండర్సన్, షహీన్ అఫ్రిది ఉన్నారు.
Spread the love కొండపల్లి లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం ప్రచారం లో భాగంగా ఆదివారం నాడు ఉదయం కోటయ్య నగర్, బొమ్మల కాలనీ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల […]
Spread the loveజగన్ అరాచక పాలనకు ముగింపు పలకండి-సుజనా కూటమి అభ్యర్థుల గెలుపు ఏపీకి చాలా అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. శనివారం పూర్ణానందం పేట, పెజ్జోని […]
Spread the loveపెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పారిశ్రామిక వేత్తలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో […]