టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారయ్యాక తొలిసారిగా నిన్న పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. నిన్న ప్రజాగళం సభ జరిగిన తీరుపై చంద్రబాబు అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేతలతో నేడు సమీక్ష నిర్వహించారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, సభ విజయవంతం అయిందనే టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, ఎన్డీయే కూటమిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రజాగళం పేరే సరైనదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు ప్రజాగళం సభల రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నాయి.
టీడీపీ ఇంకా 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను, 17 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాలు మరో రెండ్రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. అనంతరం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.
ఎన్నికలకు తగినంత సమయం ఉండడంతో కూటమిలో ఉత్సాహం పెల్లుబుకుతోంది. మే 13న పోలింగ్ జరగనుంది. అప్పట్లోగా ప్రజాగళం సభలను విస్తృతస్థాయిలో నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కూటమి భావిస్తోంది.
Spread the loveవందేమాతరం” చిత్ర రూప ప్రదర్శన అద్భుతం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన చిత్ర రూప ప్రదర్శన అద్భుతంగా ఉందని […]
Spread the loveరెండున్నరేళ్లలో మహానాడు రోడ్డు నుంచి నిడమానురు రైల్వే బ్రిడ్జ్ ఫై ఓవర్ నిర్మాణం : ఎంపి కేశినేని శివనాథ్ ఆమోదం తెలిపిన కేంద్ర జాతీయ రహదారి మంత్రిత్వశాఖ రెండు నెలల్లో టెండర్లు..సిద్ధంగా […]
Spread the loveరూ.₹3,31,254 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన-MLA బొండా ఉమ ధి:-6-11-2025 గురువారం సాయంత్రం సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నియోజకవర్గ పరిధిలోని […]