కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది.
“గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నాను. 14.03.2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి.. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి.. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి.. ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతానండి.. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి” అని ముద్రగడ తన లేఖ ద్వారా తెలియజేశారు.
Spread the loveఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. పత్రికా ప్రకటన. తేదీ.05.11.2025. కార్తీక పౌర్ణమి నేపధ్యంలో దేవాలయాలు మరియు ఘాట్ల వద్ద పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు కార్తీక పౌర్ణమి నేపధ్యంలో […]
Spread the loveవిజయవాడ నగరపాలక సంస్థ20-11-2025 పటమట హై స్కూల్ రోడ్ లో ఆక్రమణల తొలగింపు విజయవాడ నగరపాలక సంస్థ కే. సంజయ్ రత్నకుమార్ అదేశాల మేరకు నగర పరిధిలో గల పటమట లోని […]
Spread the loveపార్టనర్ షిప్ సమ్మిట్ లో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు ఇప్పటికే సమాచారమిచ్చారు డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లే రాష్ట్రానికి […]