కాపునేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. గతంలో గురువారం (మార్చి 14న) వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి ర్యాలీని రద్దు చేసుకున్నారు. ఈ నెల 15 లేదా 16వ తేదీన ముద్రగడ మాత్రమే సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ముద్రగడ ఓ లేఖ రాయడం జరిగింది.
“గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నాను. 14.03.2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపర్చి ఉన్నానండి.. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి.. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి.. ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలోకి చేరతానండి.. మీ అందరి ఆశీస్సులు వారికి, నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి” అని ముద్రగడ తన లేఖ ద్వారా తెలియజేశారు.
Spread the love మహిళలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు దిత్య హృదయం ప్రతినిధిప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని అధికారంలోకి వచ్చిన […]
Spread the love 40వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం గుడివాడ రూరల్ మండలంలో పర్యటన కల్వపూడిఅగ్రహారం.పర్నాసగుంటాకోడూరు లింగవరం గ్రామాల్లో జననీరాజనాల మధ్య విస్తృత ప్రచారం చేసిన ఎమ్మెల్యే నాని చంద్రబాబును […]
Spread the love NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం ది.30-04-2024(మంగళవారం) నందిగామలో.మరోసారి ఘన విజయం దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరుగా పార్టీలో చేరికలు నందిగామ పట్టణానికి చెందిన కీలక టిడిపి నేతలు వింజమూరి […]