ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి రజని, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీనికి సంబంధించి మంత్రి రజని, సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవినీతి సొమ్ముతో గెలవొచ్చని పగటి కలలు కంటున్నారని, ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో జగన్ గ్యాంగ్ టికెట్ల దుకాణానికి తెరలేపిందని అన్నారు. ఓవైపు ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తూ, మరోవైపు అభ్యర్థులను డబ్బులు గుంజుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టికెట్ల అమ్మకాల్లో సజ్జల సీఎం జగన్ కు బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని, టికెట్ల అమ్మకాలతో ఇప్పటివరకు రూ.1000 కోట్లను సజ్జల తాడేపల్లి ప్యాలెస్ కు పంపించారని ఆరోపించారు.
Spread the love మీడియా ధైర్యంగా పనిచేయాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసారమాధ్యమాలు దైర్యంగా పనిచేయాలని *రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పిటిఐ 77 వ వార్షికోత్సవం సందర్బంగా బుధవారం వార్తా సంస్థల ఏడిటర్ల సమావేషంలో […]
Spread the love 09-05-2024,కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా కర్నూలులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం వైయస్.జగన్. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే. కర్నూలు సిద్ధమా? ఇంతటి ఎండను […]
Spread the love విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రాయల్ హోటల్ సెంటర్ నందు రాయల్ బ్యాంకుట్ హల్ల్లో ఈ రోజు(ఎన్నికల నాడు) వైసిపికి మద్దతుగా ఐప్యాక్ టీం 15 లాప్టాప్ లతో మరియు 30 మంది […]