హైదరాబాద్ లో ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిశీలించిన అబ్దుల్ అజీజ్.

0

 అమరావతి, 03 – 03 – 2025

హైదరాబాద్ లో ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆస్తులను పరిశీలించిన అబ్దుల్ అజీజ్.

ఆస్తులను పరిరక్షించి, అభివృద్ధి పరుస్తాం.

 తద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచుతాం.

షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.

హైదరాబాద్ నగరంలోని బీకే గూడా, ఎస్సార్ నగర్, హిమాయత్ నగర్ లలో గల కర్నూల్ అంజుమన్ – ఏ – ఇస్లామియా కు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. బి.కె గూడా నందు గల 3.40 ఎకరాల వక్ఫ్ భూమిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రాగ్ పికర్స్ వారు ఆక్రమించారని ఆయన తెలిపారు. ఆక్రమణకు గురైన వక్ఫ్ భూమిని అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఏపీ వక్ఫ్ బోర్డ్ కు చెందిన స్థలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ నిర్వహిస్తుందని తెలిపారు. దీనిపై జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన ఇక్కడి నుండి డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ తరలించిన అనంతరం ఇక్కడ పెద్ద ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే హిమాయత్ నగర్ లో గల పాత షాపింగ్ కాంప్లెక్స్ లను నూతనంగా అభివృద్ధిపరిచి సర్వాంగ సుందరంగా తయారుచేస్తామని తద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచుతామని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను తక్షణమే ప్రారంభించి అందుకు అనుగుణంగా బృహత్తర ప్రణాళిక రూపొందించాలని వక్ఫ్ బోర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదీర్ కు అబ్దుల్ అజీజ్ సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version