బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో సామాజిక విషయాలపై ఆమె నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా శివరాత్రి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా దేవుడిపై ఆమె ఆరోపణలు చేసింది. దేశంలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడని, అలాంటప్పుడు ఆయనకు పూజలు ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించింది.
శివరాత్రి రోజైనా, మరో రోజైనా మనం దేవుడికి పూజలు ఎందుకు చేస్తాం? అందరు బాగుండాలి, అందరికీ మంచి జరగాలనే కదా? అని ప్రశ్నించింది. కానీ మంచి జరగడం లేదని… ఒక చిన్నారిని గ్యాంగ్ రేప్ చేశారని… అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆ చిన్నారి నరకయాతన అనుభవించి ఉంటుందని… అప్పుడు ఆమెను దేవుడు కాపాడాలని… రేప్ నుంచి తప్పించుకునేలా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
అన్ని చూస్తూనే దేవుడు ఊరుకుంటున్నాడని… ఒక్కోసారి దేవుడి ఫొటోలు పక్కన పెట్టేసి, పూజలు చేయడం మానేద్దామనిపిస్తుంటుందని కామెంట్ చేసింది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని… పేదవాళ్లు మరింత పేదవాళ్లు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కీర్తి చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా… మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.
Spread the loveకూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం “వర్షించని మేఘం… శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు […]
Spread the loveవిజయవాడ నగరపాలక సంస్థ20-11-2025 7000 కు పైగా స్వయం సహాయక బృందాల మహిళలకు సఖి సురక్ష ద్వారా ఉచిత వైద్య మరియు క్యాన్సర్ పరీక్షలు 7000 కు పైగా స్వయం సహాయక […]