బిగ్ బాస్ ఫేమ్, సీరియల్స్ నటి కీర్తి భట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్నో సామాజిక విషయాలపై ఆమె నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా శివరాత్రి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా దేవుడిపై ఆమె ఆరోపణలు చేసింది. దేశంలో మహిళలు, అమ్మాయిలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడని, అలాంటప్పుడు ఆయనకు పూజలు ఎందుకు చేయాలని ఆమె ప్రశ్నించింది.
శివరాత్రి రోజైనా, మరో రోజైనా మనం దేవుడికి పూజలు ఎందుకు చేస్తాం? అందరు బాగుండాలి, అందరికీ మంచి జరగాలనే కదా? అని ప్రశ్నించింది. కానీ మంచి జరగడం లేదని… ఒక చిన్నారిని గ్యాంగ్ రేప్ చేశారని… అప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆ చిన్నారి నరకయాతన అనుభవించి ఉంటుందని… అప్పుడు ఆమెను దేవుడు కాపాడాలని… రేప్ నుంచి తప్పించుకునేలా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది.
అన్ని చూస్తూనే దేవుడు ఊరుకుంటున్నాడని… ఒక్కోసారి దేవుడి ఫొటోలు పక్కన పెట్టేసి, పూజలు చేయడం మానేద్దామనిపిస్తుంటుందని కామెంట్ చేసింది. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారని… పేదవాళ్లు మరింత పేదవాళ్లు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కీర్తి చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా… మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.
Spread the love మారేమళ్ళ శ్రీధర్” జ్ఞాపకార్థం. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర గల నిరాశ్రయుల భవనము నందు నిరాశ్రయులకు నూతన వస్త్రములు ఇవ్వటమైనది . మరియు స్వీట్స్ పంచడమైన మరియు అమృత హస్తం […]
Spread the love జగన్ రెడ్డి చిన్నప్పుడే చంద్రబాబు అభివృద్ధిని పరిచయం చేశారన్ని దేవినేని రాష్ట్ర భవిష్యత్తును వైసీపీ నాశనం చేసిందని విమర్శ అభివృద్ధి, సంక్షేమంపై లోకేశ్ తో చర్చకు రావాలని సవాల్ వైసీపీ […]
Spread the love ఈ నెల 23 నుంచి ఇసుక బుకింగ్కు ప్రత్యేక కేంద్రాలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బుకింగ్ చేసుకోవచ్చు – స్టాక్ పాయింట్ల వద్ద బుకింగ్కు […]