విజయవాడ కు చేరుకున్న బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్

0

భారతీయ జనతాపార్టీ 

ఆంధ్రప్రదేశ్ 

విజయవాడ కు చేరుకున్న బిజెపి ఎపి ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్
విజయవాడ రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని మైక్రో లెవెల్ లో అబ్జర్వేషన్ చేసేందుకు సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ చేరుకున్నారు.
గన్నవరం విమానాశ్రయం లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి నేతలు కిలారు దిలీప్,పియూష్ లు సిద్దార్థ్ నాథ్ సింగ్ కు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సమన్వయం, జాతీయ స్థాయి నాయకులు పర్యటన లు సిద్దార్థ్ నాథ్ సింగ్ స్వీయ పర్యవేక్షణలో జరిగాయి.
ఈనేపథ్యంలో కౌంటింగ్ సరళి ఎలా ఉంటుంది, ఇక్కడ భవిష్యత్తు కార్యాచరణ వంటి విషయాలు తో పాటు ఇతర అంశాలు ను కూడా సిద్దార్థ్ నాథ్ సింగ్ స్వీయ పర్యవేక్షణ చేయనున్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version