రైతులకు అండగా కూటమి ప్రభుత్వం- పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

0

 కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్ 

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం- పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీసం మద్దతు ధర లభిస్తుంది

రేపు సాయంత్రంలోపు ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకున్నాం.. రైతులెవరు ఆందోళన చందనవసరం లేదు..

కృష్ణా జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. 

పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించిన మంత్రి మనోహర్. 

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు

వాతావరణ మార్పులతో 40 రోజులపాటు జరగాల్సిన ప్రక్రియ… నాలుగు రోజుల్లో చేయాల్సి వస్తుంది.

రైతులకు మద్దతుగా.. అధికార యంత్రాంగమంతా రాత్రి పగళ్లూ కష్టపడుతుంది.

వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా.. ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం.

ధాన్యం విక్రయాలపై..క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నాం.

రైతులకు నమ్మకం కలిగించేలా.. ధాన్యం కొనుగోల్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం.

గతంలో ఎన్నడూ లేని విధంగా.. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో.. రైతుల ఖాతల్లో నగదు జమ చేస్తున్నాం. 

24 తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. 

రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని.. సాయంత్రానికల్లా గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. 

మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా.. బకాయి నిధులు విడుదల చేశాం.

కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంక్ గ్యారంటీ వెసులుబాటు కల్పించాం. 

రైతు సహాయ కేంద్రాలను సంప్రదిస్తే.. కల్లాల వద్దకే గోనేసంచెలు.. రవాణా వాహనాలను పంపించేలా ఏర్పాటు చేశాం. 

రైతులెవరు దళాలను ప్రోత్సహించవద్దు..

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version