రెచ్చిపోయిన దొంగలు – సిగ్నల్ కట్ చేసి – చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి

0

రెచ్చిపోయిన దొంగలు – సిగ్నల్ కట్ చేసి – చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి

రైళ్లలో ప్రయాణికులే లక్ష్యంగా చేసుకుని దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తమ చేతివాటం చూపిస్తూ రైల్వే పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్​లో దోపిడీకి పాల్పడ్డారు. సిగ్నల్‌ వైర్లు కత్తిరించడంతో రైలు ఆగిపోయింది.

ఈ క్రమంలో దుండగులు ఎస్‌1, ఎస్‌2 బోగీల్లోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ముంబయి నుంచి చెన్నైకి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై బాధితులు రేణిగుంట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version