Home Andhra Pradesh రెండెకరాల భూమిని కొనుగోలు చేసిన నమ్రత

రెండెకరాల భూమిని కొనుగోలు చేసిన నమ్రత

3
0


 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్  రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గోపులారం గ్రామంలో ఇటీవల రెండెకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం నిన్న శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం ఆమె చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చింది.


ఈ క్రమంలో ఆమెను గుర్తించిన మహేశ్ అభిమానులు నమ్రతను చుట్టుముట్టి సందడి చేశారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో హడావుడి కనిపించింది. నమ్రత ఏమాత్రం విసుగు చెందకుండా అందరితో ఫొటోలు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here