ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

0

 *25.11.2024*

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లా మారిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ లోని తన క్యాంప్ కార్యాలయం నందు సోమవారం సాయంత్రం పొట్టి పాడు కు చెందిన పోట్ల కృష్ణ ప్రసాద్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన .6,42,153 చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందచేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందించటం కోసం కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని అన్నారు . వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయం ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు ప్రతి ఒక్కరికీ అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version