ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీట్లు అమ్ముకుంటూ కోట్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మల్లెల రాజేశ్ నాయుడు నుంచి మంత్రి రజని, సజ్జల రూ.6.5 కోట్లు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీనికి సంబంధించి మంత్రి రజని, సజ్జలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అవినీతి సొమ్ముతో గెలవొచ్చని పగటి కలలు కంటున్నారని, ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో జగన్ గ్యాంగ్ టికెట్ల దుకాణానికి తెరలేపిందని అన్నారు. ఓవైపు ఓటర్లకు కానుకలు పంపిణీ చేస్తూ, మరోవైపు అభ్యర్థులను డబ్బులు గుంజుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టికెట్ల అమ్మకాల్లో సజ్జల సీఎం జగన్ కు బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని, టికెట్ల అమ్మకాలతో ఇప్పటివరకు రూ.1000 కోట్లను సజ్జల తాడేపల్లి ప్యాలెస్ కు పంపించారని ఆరోపించారు.
Spread the love బాప్టిస్ట్ పాలెం సమస్యలను పరిష్కరిస్తా సు జనా చౌదరి బాప్టిస్ట్ పాలెం ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని పశ్చిమ నియోజకవర్గ బిజెపి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. డాక్టర్ కటికల మనోజ్ […]
Spread the love ఏసిబి వలలో కూరబలకోట విద్యుత్ ఏఈ అన్నమయ్య జిల్లా 32 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఏఈ వెంకటరత్నం.. ఎసిబి డిఎస్పీ ఆధ్వర్యంలో […]
Spread the love పంజాబ్ హర్యాన గర్భిణులు, బాలింతలకు బెయిల్ ఇవ్వాల్సిందే: హై కోర్ట్ జైలులో ఉన్న గర్భిణులు, పాలిచ్చే బాలింతలకు ప్రసవం నుంచి ఏడాది వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు […]