ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ మంత్రుల విమర్శల దాడి కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున పురందేశ్వరి వకాల్తా పుచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని, ఆమె టీడీపీ కోసం పనిచేసినా తమకు ఇబ్బందేమీ లేదని, కానీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
పురందేశ్వరి మద్యం విషయంలో చంద్రబాబుతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని పురందేశ్వరి గ్రహించాలని సూచించారు. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే పురందేశ్వరి టీడీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు.
మంత్రి పెద్దిరెడ్డి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
Spread the love దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన గొప్ప సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు. * సింగ్ నగర్, పాయికాపురంలో […]
Spread the love 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్ లో ముగింపు రోజు కోలాహలంగా ప్రచారం ఎమ్మెల్సీ జనాబ్ ఎండీ రుహుల్లా సారధ్యంలో విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పార్లమెంట్ అభ్యర్థి […]
Spread the love దేశ వ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ […]