చనిపోయిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్

0

 *ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*

*ది.26.03.2023.*

చనిపోయిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ 

విజయవాడ నగరంలో పనిచేస్తున్న హోంగార్డులలో ఎవరైనా మరణించిన లేక పదవీ విరమణ చేసిన వారు ఆర్ధికంగా ఇబ్బందులు పడకుండా చేయడానికి నగరంలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా వారికి వచ్చే వేతనం నుండి సదరు చనిపోయిన హోంగార్డు కుటుంబాలకు లేదా పదవీ విరమణ చేసిన హోంగార్డులకు ఆర్థిక ఆసరా కల్పిస్తున్న విషయం విదితమే.

ఈ సందర్భంగా విజయవాడ నగర హోంగార్డు యూనిట్ నందు విధులు నిర్వహిస్తూ ది. 1.02.2025 వ తేదీన   ఎమ్.పద్మావతి (డబల్యూ హెచ్.జి. నెం 624)  హార్ట్ అట్టాక్ తో మరణించినారు. వారి కుటుంబానికి ఆర్ధిక సహాయంగా రూ. 5 లక్షల నగదు చెక్కును ఈ రోజు ది. 26.03.2025 వ తేదీన పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్  ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్  చేతులమీదుగా చనిపోయిన హోంగార్డ్  కుమారుడైన ఎమ్.క్రాంతి  కుమార్ కు అందజేయటమైనది.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి.  కె.జి.వి.సరిత ఐ.పి.యస్  హోంగార్డు ఆర్.ఐ. కె.సుధాకర్ రెడ్డి  మరియు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్.సోమయ్య  ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version