17. 7. 2025 తేదీ విజయవాడ భవానిపురం మార్కెట్ యార్డ్ నందు గురువారం ఎన్టీఆర్ జిల్లా మార్కెట్ యార్డ్ కమిటీ ఏ ఎం సి చైర్మన్ గా నర్రా వాసు బాధ్యతలు స్వీకరించారు చైర్మన్ నర్రా వాసు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ కేశినేని చిన్ని, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ లకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తను నమ్మి అప్పగించినందుకుగాను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.మైలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల గాంధీ మాట్లాడుతూ బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు అందించడమే లక్ష్యంగా రైతుల సమస్యలను పరిష్కరించటంలో సమగ్ర కార్యాచరణతో ముందుకెళ్తుందని అన్నారు