కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ముద్రగడ అలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ముందు నుంచి తన కారులో వెళ్తూ అక్కడ తన వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో చంద్రబాబు, కేంద్రమంత్రి షెకావత్, జనసేనాని పవన్ కల్యాణ్ లు చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఇంటి ముందు పాల్ కాసేపు హల్ చల్ చేశారు. పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.
చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏమీ ఆశించడం లేదని పాల్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని చెప్పారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు చేశారని విమర్శించారు. పాలన అంటే సినిమాలో డ్యాన్సులు చేయడం కాదని ఎద్దేవా చేశారు. కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా ఏపీని మోసం చూస్తూనే ఉందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెపుతారని అన్నారు. సినీ నటుడు, సీనియర్ లీడర్ బాబూ మోహన్ కూడా తమ పార్టీలో చేరారని… మరింత మంది కీలక నేతలు తమ పార్టీలో చేరాలని ఆయన కోరారు.
Spread the love పశ్చిమ నియోజకవర్గ.ఎన్నికల్లో ప్రచారం భాగంగా ఈరోజు ఉదయం 52వ డివిజన్. మల్లికార్జున పేట ఇంచార్జ్. తంగిళ్ళపూర్ణచంద్రరావురాము ఆధ్వర్యంలో కొండ ప్రాంతాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు వెళ్లి […]
Spread the love సుజనా గెలుపు పేద ప్రజల గెలుపు అన్ని వర్గాల ప్రజలు మద్దతుస్తున్నారు బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ విజయవాడ పశ్చిమ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపు పేద […]
Spread the love మహిళలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు దిత్య హృదయం ప్రతినిధిప్రజాసంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని అధికారంలోకి వచ్చిన […]