ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం నిందితుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయ అరంగేట్రం చేశారు. గతరాత్రి ఆయన ‘జైభీమ్ భారత్’ పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాసరావు అమలాపురం నుంచి పోటీచేసే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తాను పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టు చెప్పారు. కులం కోసమో, మతం కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చట్టసభల్లో అడుగుపెట్టి పేదల సమస్యలు తీర్చాలని భావించి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో దగాపడిన శ్రీనివాసరావు దళిత, రాజ్యాంగ రక్షణ కోసం తపన పడుతున్నారని పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ చెప్పారు. పులివెందుల నుంచి తమ పార్టీ తరపున జగన్పై దస్తగిరి పోటీ చేయబోతున్నట్టు తెలిపారు.
Spread the love మూలపాడు,కిలేశపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామస్తులు అత్మీయ స్వాగతం […]
Spread the loveఎన్టీఆర్ జిల్లా, మే 09, 2024 ప్రజాస్వామ్య పరిరక్షణ ధీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచిన 99 ఏళ్ల అడుసుమిల్లి వేణుగోపాలరావు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న సంకల్పానికి అడుసుమిల్లి […]
Spread the love ప్రతిక్షణం ప్రజల కోసం – ప్రతి అడుగు పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు కోలవెన్ను గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ కంకిపాడు – ఈ రోజు(29/04)న […]