టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని మళ్లీ కైవసం చేసుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో అద్భుత ప్రతిభ కనబరిచిన అశ్విన్… టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టి నెంబర్ వన్ ర్యాంకును చేజిక్కించుకున్నాడు.
ధర్మశాలలో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు అశ్విన్ కెరీర్ లో 100వ టెస్టు. ఈ మ్యాచ్ లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్ లో 4, రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొత్తమ్మీద ఈ ఐదు టెస్టుల సిరీస్ లో అశ్విన్ 26 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
ఇక, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో బుమ్రా, హేజెల్ వుడ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా కగిసో రబాడా, ప్యాట్ కమిన్స్, నాథన్ లైయన్, రవీంద్ర జడేజా, ప్రభాత్ జయసూర్య, జేమ్స్ ఆండర్సన్, షహీన్ అఫ్రిది ఉన్నారు.
Spread the loveవిద్యార్థులను దేశానికి పనికొచ్చే శక్తులుగా తయారు చేయాలి • తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం అవసరం• కేరళ తరహా విద్యావిధానం అమలు అవసరం• రాష్ట్ర ఐ.టి., మానవ వనరుల శాఖ […]
Spread the love కాపు సామాజికవర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. […]
Spread the love టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెనుకొండ రా కదలిరా సభలో వాలంటీర్ల ప్రస్తావన తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల కల్పన […]