తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు.
ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Spread the love ఏసిబి వలలో కూరబలకోట విద్యుత్ ఏఈ అన్నమయ్య జిల్లా 32 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఏఈ వెంకటరత్నం.. ఎసిబి డిఎస్పీ ఆధ్వర్యంలో […]
Spread the loveపార్టీలో ప్రతీ ఒక్క కార్యకర్తకూ న్యాయం జరగాలి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలి నెలాఖరులోగా అన్ని పార్టీ, నామినేటెడ్ పదవులూ భర్తీ చేస్తాం ఇంఛార్జ్ మంత్రులు, స్థానిక […]