వైసీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు టికెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు, సిట్టింగ్ ఎమ్మెల్యే (చెన్నకేశవరెడ్డి)కి మధ్య డబ్బు పోటీ పెట్టారని ఆరోపించారు.
అయితే, నా వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌరవంగా తప్పుకున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు. మరి ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఎంత సమర్పించారో తనకు తెలియదని అన్నారు.
బీసీలకు బీసీలకు మధ్య, ఎస్సీలకు ఎస్సీలకు మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సంజీవ్ కుమార్ విమర్శించారు. గొడవలు సృష్టించే విచ్ఛిన్నకర రాజకీయాలు వైసీపీలో చూశానని వెల్లడించారు.
Spread the love వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి అనపర్తి నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక ప్రతిపాదనలను ఈ సందర్బంగా చర్చిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి […]
Spread the love 10..10..2024 దుర్గాదేవి చెంత సాంస్కృతిక శోభ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కనకదుర్గ నగర్ […]
Spread the love *రాష్ట్రంలో ప్రతీరైతు సంతోషంతో వ్యవసాయం చేసేలా ప్రత్యేక విధానం* *సాగులో ఆధునిక టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహిస్తాం* వ్యవసాయాధికారులు ప్రతీరోజు గ్రామాలలో చిన్న,సన్నకారు రైతులను అవగాహన పరచాలి-రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర […]