వైసీపీకి గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నాయకత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే ప్రతిపాదన చేశారని వెల్లడించారు. వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు టికెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు, సిట్టింగ్ ఎమ్మెల్యే (చెన్నకేశవరెడ్డి)కి మధ్య డబ్బు పోటీ పెట్టారని ఆరోపించారు.
అయితే, నా వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌరవంగా తప్పుకున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు. మరి ఎమ్మిగనూరు వైసీపీ టికెట్ దక్కించుకున్న బుట్టా రేణుక ఎంత సమర్పించారో తనకు తెలియదని అన్నారు.
బీసీలకు బీసీలకు మధ్య, ఎస్సీలకు ఎస్సీలకు మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సంజీవ్ కుమార్ విమర్శించారు. గొడవలు సృష్టించే విచ్ఛిన్నకర రాజకీయాలు వైసీపీలో చూశానని వెల్లడించారు.
Spread the love విద్యార్థుల ప్రతిభకు నిరంతరం తోడ్పాటు,ప్రోత్సాహకాన్ని అందిస్తున్న శ్రీ సాయి ఆరాధన క్షేత్రం షిరిడి, విజయవాడ వారికి ప్రత్యేక అభినందనలు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. చందర్లపాడు మండలం – 02 ఆగస్టు […]
Spread the love పొంగి పొర్లుతున్న డ్రైనేజ్ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విన్నవించిన స్థానికులు ఎమ్మెల్యే ఆదేశాలతో 39 వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీ డ్రైనేజీ పనులు చేసిన కార్పొరేషన్ సిబ్బంది విజయవాడ […]
Spread the love సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు *అమరావతి :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి […]