భారత్లో సాంకేతిక స్వావలంబన దిశగా మరో కీలక అడుగు పడింది. త్వరలో దేశంలోని అన్ని గడియారాలు(స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లతో సహా) ఇస్రో రూపొందించిన రుబీడియం అటామిక్ క్లాక్ ప్రకారం పనిచేయనున్నాయి. ఈ దిశగా త్వరలో గడియారాలన్నీఈ అటామిక్ క్లాక్తో సింక్ చేయనున్నారు. ప్రస్తుతం భారత్లోని వ్యవస్థలు అమెరికా రూపొందించిన నెట్వర్క్ టైం ప్రొటోకాల్ను అనుసరిస్తున్నాయి.
అయితే, ఇస్రో గతేడాది రూబీడియం క్లాక్ను రూపొందించింది. స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్లో దిన్ని తొలిసారిగా ఉపయోగించారు. నావిక్లోని తొలి తొమ్మది ఉపగ్రహాలను 2013 నుంచి 2023 మధ్య లాంచ్ చేయగా వాటిల్లో..విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రుబీడియం అటామిక్ క్లాక్స్నే ఉపయోగించారు. అయితే, గతేడాది మేలో ప్రయోగించిన పదో ఉపగ్రహంలో మాత్రం ఇస్రో రూపొందించిన అటామిక్ క్లాక్ను వినియోగించారు. ఈ క్రమంలో దేశంలోని అన్ని గడియారాలను ఈ క్లాక్ టైంతో త్వరలో సింక్ కానున్నాయి.
Spread the love నిన్న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేశారు. హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని […]
Spread the love ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్న అద్దెదారులు స్నానాల కోసం జిమ్లకు వెళ్తున్న వైనం కరవు జిల్లాలుగా బెంగళూరు నగరం, బెంగళూరు రూరల్ తోటపని, నిర్మాణం, నీటి ఫౌంటెన్ల వంటి వాటికి […]
Spread the love లిక్కర్ పాలసీ విచారణ వ్యవహారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, ఈడీకి మధ్య డ్రామా కొసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ ఇప్పటికే 8 సార్లు […]