బాలీవుడ్ నటి, బీజేపీ లోక్ సభ అభ్యర్థి కంగనా రనౌత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ కు షాక్ తగిలింది. ఆమెను లోక్ సభ అభ్యర్థుల జాబితా నుంచి పార్టీ హైకమాండ్ తొలగించింది. కంగనకు హిమాచల్ ప్రదేశ్ లోని మండి ఎంపీ టికెట్ ను బీజేపీ కేటాయించింది. ఈ నేపథ్యంలో కంగనను ఉద్దేశించి సోషల్ మీడియాలో సుప్రియా అనుచిత కామెంట్ చేశారు. కంగన బ్రా ధరించి ఉన్న ఫొటోను షేర్ చేసింది.
దీనిపై కంగన ఘాటుగా స్పందించింది. సెక్స్ వర్కర్ల దుర్భర జీవితాను ప్రస్తావిస్తూ… ఇతరులను దూషించడం మానుకోవాలని అన్నారు. మరోవైపు, ఆ పోస్టు తాను చేయలేదని… తన ఇన్స్టా, ఫేస్ బుక్ యాక్సెస్ యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సుప్రియకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రియ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేదని వ్యాఖ్యానించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల జీవితాల గురించి ఎలాంటి విమర్శలు చేయవద్దని హెచ్చరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రియపై కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంది. లోక్ సభ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరును పక్కన పెట్టింది. 2019లో ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్ గంజ్ నుంచి సుప్రియ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పడు ఆమెను ఆ స్థానం నుంచి తప్పించి వీరేంద్ర చౌదని పేరును కాంగ్రెస్ ప్రకటించింది.
Spread the love సుజనా రోడ్ షోకు బ్రహ్మరథం తిరుమల, అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనారిటీలకు హజ్ హౌస్ […]
Spread the love ప్రతిక్షణం ప్రజల కోసం ప్రతి అడుగు పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు ఆదిత్య హృదయం ప్రతినిధిమం తెన గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ కంకిపాడుఈ రోజు(30/04)న మండలంలోని […]
Spread the love ఎన్టీఆర్ జిల్లా, మే 11, 2024 జిల్లాలో ప్రశాంత పోలింగ్కు సర్వం సిద్ధం – హింసాత్మక సంఘటనలకు, రీపోలింగ్కు ఆస్కారం లేకుండా భద్రతా ఏర్పాట్లు – ఈ నెల 13న […]