ఇంద్రకీలాద్రి SBV రామగుప్త మరియు కుటుంబసభ్యులు రూ.1,00,116/-లను దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం విరాళముగా
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ:
ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకంనకు కొత్తపేట, విజయవాడ కు చెందిన SBV రామగుప్త మరియు కుటుంబసభ్యులు రూ.1,00,116/-లను దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం విరాళముగా ఆలయ అధికారులను కలిసి దేవస్థానంనకు చెక్కును అందజేశారు.
దాత కుటుంబంనకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.