హరే కృష్ణమూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్
తుఫాన్ దృస్ట్యా భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రజలను ఉద్దేశించి ఆహారం అందిచాలని రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్యులు నారాయణ, అన్నా కాంటీన్స్ ఎంతో చక్కగా నిర్వహిస్తున్న హరే కృష్ణమూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ఆంధ్రప్రదేశ్,అక్షయ పాత్ర అనుభంద సంస్థ ద్వారా వరద ముప్పులో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని నిర్ణయించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోగల అక్షయపాత్ర వద్ద శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మొదటి రోజు 60 వేల మంది నుంచి లక్ష మంది స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతి రోజు 2లక్ష ల నుంచి 2.5లక్షల మందికి భోజనాన్ని అందిస్తున్నారు. ఈ మహాత్తారమైన, మహా పుణ్యమైన ఈ కార్యక్రమనికి దివిస్ సంస్థ ఎండి మురళి కృష్ణ వాలంటీరుగా మమ్మల్ని సంప్రదించి మాకు పూర్తి మద్దతు తెలిపారు. ఇప్పటివరకు 4కోట్ల 80 లక్షల రూపాయలు మాకు విరాళాన్ని ఇచ్చి ఆ విరాళం ద్వారా ఈ ముంపు ప్రాంతాలకు భోజనాన్ని సరఫరా చేయించమని మాతో చెప్పారు మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి భోజనం తయారు చేయడం జరిగింది.అదే విధంగా ప్రభుత్వానికి మరియు అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబునాయుడు, అలాగే మిగతా అధికారులు అందరి సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం సాధ్యమైది. ప్రభుత్వం, ఎన్జీవోస్ దాతలు కలిసి ఉమ్మడి సహకారంతో ఎంత కష్టమైన పని ఇయినా చేయొచ్చు అనేదానికి ఇదిఒక మంచి ఉదాహరణ. ఇక ముందు ఎలాంట విపత్తు వచ్చిన సరే ఈ అద్భుతమైన కంబినాషన్ ద్వారా ఎదుర్కొగలమణి హరే కృష్ణమూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజియన్ అధ్యక్షులు వంశీధర్ దాసు అభిప్రాయ పడ్డారు. ఆయన సహకిరించిన దాతలకు ప్రతిఒక్క రికి, మీడియా ప్రతునిధులకి ధన్యవాదములు తెలిపారు. వివరాలకు రఘునందన్ దాస్ :7386713300 ని సంప్రదించాలని తెలిపారు.