అక్రమంగా ఉచిత ఇసుక నిల్వ ఉంచిన వారిపై కేసులు నమోదు చేస్తాం.
విజయవాడ పోలీసు కమిషనర్
అనంతజనశక్తి న్యూస్”AP&TG
రాష్ట్ర ప్రభుత్వ వారు అందిస్తున్న ఉచిత ఇసుకను అక్రమంగా దారిమళ్లీస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజశేఖర బాబు టాస్క్ ఫోర్స్, ఎస్. బి. మరియు లా అండ్ ఆర్డర్ అధికారులు మరియు సిబ్బందితో పలు ప్రత్యేక బృందలను ఏర్పాటు చేసి, నందిగామ,చిల్లకల్లు, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలలో దాడులు నిర్వహించి అనదికారికంగా నిల్వ ఉంచిన ఇసుక డంప్ చేసిన ఆరు ఇసుక డంప్ లను స్వాధీనం చేసుకుని వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేశారు.
జి.ఓ. నెంబర్ 66 ప్రకారం ఉచిత ఇసుక ప్రజలు వారి సొంత అవసరాలకు వాడుకోవడానికే తప్ప లారీల తరలించడం గాని అమ్మకాలు చేయడం గాని, డంపింగ్ చేయడం గాని చేయరాదు. ఈ విధంగా ఎవరైనా అనదికారికంగా ఇసుకను డంప్ చేరిన వారిపై మరియు అమ్మకాలు జరిపిన వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు పత్రికా ప్రకటన ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.