Home Andhra Pradesh హిందీ మహా విద్యాలయాన్ని పునర్ నిర్మించాలని వినతి వన్ టౌన్, తారాపేట లోని ...

హిందీ మహా విద్యాలయాన్ని పునర్ నిర్మించాలని వినతి వన్ టౌన్, తారాపేట లోని గాంధీ కొండ దిగువన

5
0

హిందీ మహా విద్యాలయాన్ని పునర్ నిర్మించాలని వినతి వన్ టౌన్, తారాపేట లోని గాంధీ కొండ దిగువన శిధిలావస్థకు చేరుకొని కాలక్రమేణ, మరుగున పడి, కనుమరుగైన హిందీ మహా విద్యాలయాన్ని పునర్ నిర్మించాలని పూర్వ విద్యార్థులు,మరియు అధ్యాపకులు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు. హిందీని ఒక జాతీయ భాషగా చేర్చి జాతి సమైక్యతను ప్రోత్సహించడానికి మహాత్మా గాంధీ సమకాలీకులు , స్వాతంత్ర సమరయోధులు ప్రముఖ హిందీ పండిట్ , చర్ల జనార్ధన స్వామి ఆధ్వర్యంలో విజయవాడ, పశ్చిమ నియోజకవర్గంలోనీ గాంధీ కొండ దిగువన అనేక దశాబ్దాల పాటు హిందీ మహా విద్యాలయం దేదీప్యమానంగా వెలుగొందింది.జాతి సమైక్యతను ప్రోత్సహించి,సాహిత్యం, భాషా ప్రాముఖ్యతపై దృష్టి పెట్టి విశేష సేవలు అందించిన హిందీ విద్యాలయం ప్రాముఖ్యతను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో పూర్వ అధ్యాపకుడు పొట్నూరు దేవరాజ్ కుమార్, పూర్వ విద్యార్థి బాయన హేరంభ కుమార్ లు ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కు వినతి పత్రం అందజేయగా బుధవారం గాంధీ కొండ దిగువన హిందీ మహా విద్యాలయం కనుమరుగైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్తానని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.





LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here