Home Political news గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కొత్తపేట...

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద గల పోతిన వెంకట మహేష్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది.

3
0

 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద గల పోతిన వెంకట మహేష్  కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా పోతన వెంకట మహేష్ ప్రజలకు చిన్నారులకు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు.

జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం మహేష్  పిల్లలకు పుస్తకాలు పెన్నులు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేసినారు. 

అనంతరం మహేష్  మాట్లాడుతూ 

1.దేశంలో రైతులు కౌలు రైతులు కన్నా ఎక్కువగా యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని 30 సంవత్సరాల లోపు యువత రోజుకు 32 మంది అంటే ప్రతి 42 నిమిషాలకి ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని, 

2.అట్లాగే మహిళలపై  అఘాయిత్యాలు రోజుకి 88 మంది మీద జరుగుతున్నాయని అంటే ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళపై రేప్ జరుగుతుందని కానీ వీరిలో కేవలం 30 శాతం మందికి మాత్రమే శిక్షలు పడుతున్నాయని

3. దేశంలో 2021 22 సంవత్సరంలోని 6 వేలకు పైగా ఎమ్మేలు మూతప పడ్డాయని దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది యువత నష్టపోయారని

4. పేద సామాన్య మధ్య తరగతి వర్గాలు విద్యా వైద్యం వలన వారి సంపాదన సరిపోక అప్పులు చేస్తున్నారని వారి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని 

5.దేశంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను కేవలం 45 శాతం మంది మాత్రమే అభ్యసిస్తున్నారని కానీ అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికాలో 85% ఇంగ్లాండ్లో 90% జపాన్ లో 95% ప్రభుత్వ బడుల్లోనే పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని 

6.అదే విధంగా ప్రతి 1000 మంది ప్రజలకు ఒక డాక్టర్ ఉండాల్సిన ఆవశ్యకత ఉందని కానీ 1600 మంది ప్రజలకు కూడా ఒక డాక్టర్ నేడు అందుబాటులో లేరని 

7.పేద సామాన్య మధ్యతరగతి వర్గాల మీద ప్రత్యక్ష పరోక్ష పన్నుల భారం పడుతుందని కానీ బ్యాంకులను మోసం చేసిన వ్యక్తులకు మాత్రం పది లక్షల 80 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని, 

ప్రభుత్వాలను ప్రజలు మాకెందుకులే అని చూస్తూ ఊరుకుంటూ పోతే చాలా సౌకర్యాలు వారికి అందవని ఇది మనకెందుకులే అని ఊరుకో రాదని భరించలేనివి భరించమని ప్రభుత్వాలకి తెలియజేయాలని అదేవిధంగా అభిమానంతోనూ ద్వేషంతోను కొన్ని అంశాలను ప్రభుత్వాలకు బలంగా తెలియజేయకపోతే భవిష్యత్తు దెబ్బతింటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యాం  సీనియర్ రాజకీయ నాయకులు బొంతు గంగాధర్ , నూనె సోమశేఖర్, జెల్లీ రమేష్ ,సిగ్నమ్ శెట్టి రాము గుప్తా, అడ్డూరి తమ్మారావు, సోమీ గోవింద్, షేక్ షాహినా, నేమాల సంజీవరావు, పిల్లా రవి, శ్రీరామ్ శ్రీనుబాబు, బేతాళం రవికుమార్, తమ్మిన రఘు, చింతాడ నాని, పిల్లా శంకర్, పోతిన వెంకటేష్ ,సాబిన్కర్ నరేష్, లండ ప్రశాంత్, పైలా పవన్, అగ్ని హారం.రాజు,మరిపెళ్ళ చిన్నారావు, షేక్ పండు,తమ్మిన బాబి, గూడేల దుర్గారావు,కొరగంజి సాంబ, దీపు, నాని, చిన్న, పిల్ల అయ్యప్ప, సోమీ మహేష్ ‌,హేమకుమార్, దుక్క గోపి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here