శబరిమల చరిత్రలో తొలిసారి భారీగా ఆదాయం
శబరిమలను దర్శించుకున్న 55 లక్షల మంది
ఈ సీజన్లో మొత్తం రూ.440 కోట్ల ఆదాయం
గతేడాది కంటే ఏకంగా రూ.86 కోట్ల అధికం
కేరళలోని శబరిమల శ్రీఅయ్యప్ప స్వామి ఆలయానికి ప్రస్తుత మండల-మకరవిళక్కు సీజన్లో రూ.440 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) సోమవారం ప్రకటించింది.
గత ఏడాదితో పోల్చితే ఇది రూ.86 కోట్లు అధికమని దేవస్వం బోర్డు చైర్మన్ పీఎస్ ప్రశాంత్ వెల్లడించారు.
గత ఏడాది రూ.354 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు.
సాధారణంగా ప్రతి ఏటా సుమారు రూ. 4-5 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని, కానీ ఈ ఏడాది భారీగా పెరిగిందని ఆయన అన్నారు.
ఈస్థాయిలో ఆలయం రావడం ఆలయ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం.