ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ .08-02-2025
గంజాయి కేసులలో 06 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా& ఆర్డర్ బృందాలు
నిందితుల వద్ద నుండి సుమారు 50 వేలరూపాయల విలువైన 09 కేజీల గంజాయి స్వాదీనం.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డి.జి.పి. హరీష్ గుప్తా ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ ఏ డి సి పి శ్రీ ఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ పరిదిలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా & ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదకద్రవ్యాల కేసులలో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ క్రమంలో సిటి టాస్క్ ఫోర్సు మరియు లా& ఆర్డర్ బృందాలకు రాబడిన పక్కా సమాచారం మేరకు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాపురం అనుమానంగా తిరుగుతున్న 06 మందిని అదుపులోనికి తీసుకుని విచారించి వారి వద్ద నుండి 09 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.
నిందితుల వివరాలు:
*సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ క్రైమ్.నెం 22/2025 NDPS Act కేసులో*
1. విజయవాడ దుర్గాపురం ఏరియాకి చెందిన పెడసొనగంటి ప్రణీత్ @ ప్రణీత్ మార్లే (23 సం.)
2. విజయవాడ గొల్లపూడి సాయి పురం కాలనీకి చెందిన గంధం జస్వంత్ @ చందు (20 సం.)
3. విజయవాడ ప్రసాదంపాడు యాదవుల బజార్ కు చెందిన కొడాలి ఎమరాల్డ్ (23 సం.)
4. విజయవాడ సత్యనారాయణపురం బావాజీపేటకు చెందిన గంగ శ్రీను (25 సం.)
5. విజయవాడ రామవరప్పాడు ఏరియాకు చెందిన మాయర మహేష్ (22 సం.)
6. విజయవాడ కేదారేశ్వరపేట ఏరియా కు చెందిన కాకర్ల చైతన్య @ చైతు (19 సం.)
వీరందరూ వేరు వేరు మార్గాల ద్వారా గంజాయికి అలవాటు పడి, గంజాయి సేవించు సమయంలో ఒకరి ద్వారా మరొకరు పరిచయమై, గంజాయిని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఏరియాల్లో వీరు కొనుగోలు చేసి వీరికి కావాల్సింది వాడుకొని మిగిలిన గంజాయిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాపురం ఏరియాలో కొందరు అక్రమంగా గంజాయి కలిగి ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు మరియు గవర్నర్ పేట పోలీస్ వారు పైన తెలిపిన ఆరుగురిని అదుపులోనికి తీసుకుని వారి వద్ద నుండి 9 కేజీల గంజాయిని, వారు ఉపయోగించే బైక్ ను స్వాదీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో నిందితులైన మరో ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ కుమార్ ని, నాగ శ్రీనివాస్ ని, ఎస్. ఆర్. పేట ఇన్స్పెక్టర్ అహ్మద్ అలీ ని మరియు వారి సిబ్బందిని అధికారులు అభినందించారు.
ప్రజలందరూ మీ పరిసర ప్రాంతాలలో ఏమైనా గంజాయి సాగు, మత్తుపదార్ధాలను రవాణా, విక్రయించడం మరియు సేవించడం వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ క్రింది తెలిపిన ప్రత్యేక నెంబర్ మరియు Mail.ID ల ద్వారా నార్కోటిక్ సెల్ పోలీస్ వారికి తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడును. నెంబర్: 9121162475*Mail.ID: antinarcoticcell@vza.appolice.gov.in