Home Political news ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అభివృద్ధి పై...

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్ ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అభివృద్ధి పై చ‌ర్చ‌లు

3
0

03-03-2025

ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసిన ఆటోన‌గ‌ర్ ఇండ‌స్ట్రీయ‌లిస్ట్స్

ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అభివృద్ధి పై చ‌ర్చ‌లు

 

నూత‌న ప‌రిశ్ర‌మ‌లు తీసుకువ‌చ్చేందుకు ఎంపి కేశినేని కృషి 

విజయ‌వాడ : ఆటో మొబైల్ రంగంలో నూత‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు స్థాపించ‌టానికి కావాల్సిన స‌దుపాయాలు, ప్ర‌భుత్వం అందించాల్సిన స‌హాయ స‌హ‌కారాలు, కొన‌సాగుతున్న ప‌రిశ్ర‌మ‌ల‌కు అందించాల్సిన‌ చేయూత గురించి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తో చ‌ర్చించారు. 

ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఆటోన‌గ‌ర్ లోని ఆటోమొబైల్ పారిశ్రామిక వేత్త‌ల‌తోపాటు ఇత‌ర పారిశ్రామిక‌వేత్త‌లు సోమ‌వారం గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ‌లో పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ను క‌లిసి ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ లో ని ప‌రిశ్ర‌మ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు వారి దృష్టికి తీసుకువ‌చ్చారు. అలాగే ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీలో ఎంప్లాయిమెంట్ పెంచేందుకు విద్యా వ్య‌వ‌స్థ‌లో తీసుకురావాల్సిన సంస్క‌ర‌ణ‌లు గురించి ఎఫ్ట్రానిక్స్ సి.ఈ.వో రామ‌కృష్ణ‌ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ స‌మావేశం అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ కి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు మెమెంటో బ‌హుక‌రించారు. 

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మాట్లాడుతూ ఆటోన‌గ‌ర్ లో ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీ ను అభివృద్ది చేసేందుకు నూత‌న ప‌రిశ్ర‌మ‌లు తీసుకురావ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. నూత‌న ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించాల‌నుకునే పారిశ్రామిక‌వేత్త‌లకు ఎలాంటి స‌దుపాయాలు, ప్ర‌భుత్వం నుంచి కోరుతున్న స‌హ‌కారం గురించి ముఖ్య‌మంత్రి తోపాటు విద్యా, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ల‌టంతో పాటు స్వ‌యంగా తీసుకువెళ‌తాన‌ని మాట ఇచ్చారు. ఆటోన‌గ‌ర్ లోని జి.వో నెంబర్ 5, 6 వ‌ల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు పారిశ్రామిక వేత్త‌లు ఎంపి కేశినేని శివ‌నాథ్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌గా, సెక్ర‌ట‌రీలో రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ సెక్ర‌ట‌రీను క‌లిసే ఏర్పాట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ చేశారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ఎ.పి.ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ ప్రెసిండెంట్ బాయన వెంకట రావు, ప్రెసిడెంట్ దోనేపూడి దుర్గాప్రసాద్, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఎమ్. రామ‌చంద్ర‌రావు, జె.ఆర్.డి టాటా ఇండస్ట్రీస్ ఎస్టేట్ సోసైటీ చైర్మన్ వినోద్ బాబు, విజ‌య‌వాడ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ సెక్రటరీ టి.నాగేశ్వరరావు, పారిశ్రామిక‌వేత్త‌లు జి. సాంబ‌శివ‌రావు, ర‌వి కుమార్ , టి.పార్థ‌సార‌ధి, జి.శ్రీనివాస్, స‌త్యానారాయ‌ణ, రామ‌కృష్ణ‌, అమ‌రనాథ్ మంగం, చిరంజీవి , శ్రీరామ్, రామ కుమార్ , కె.విశ్వ‌ప్ర‌సాద్ , టిడిపి రాష్ట్ర నాయ‌కులు మాదిగాని గురునాథం, ఎమ్.ఎస్.ఎమ్.ఈ ప్రోగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ డాక్ట‌ర్ సంకె విశ్వ‌నాథం, మాజీ కార్పొరేట‌ర్ కాకు మ‌ల్లిఖార్జున యాద‌వ్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here