విజయవాడ నగరపాలక సంస్థ
21-03-2025
ప్రజల క్షేమం, నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యం- నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి
ప్రజల క్షేమం, నగరాభివృద్ధే లక్ష్యం అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో 2024 -25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ముఖ్యాంశాలను వివరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 40.9 కోట్లు తో 47.46కి సీసీ రోడ్లను, బీటీ రోడ్లు 6.80 కోట్ల రూపాయలుతో 4.33 కి మీ వేశారని,
15 ఫైనాన్స్ కమీషన్ లో గాలి నాణ్యతని మెరుగుపరచడం కోసం 24.91 కి మీ మేర 17 కోట్లు ఆమోదించారని, కొండ ప్రాంతంలో మెట్లు, ల్యాండింగ్, ట్రాంప్ లు కి 2.95 కోట్లతో పనులు పూర్తి చేశారని,
40వ డివిజన్ లో 1500 kl కెపాసిటీ గల రిజర్వాయర్ నీ 3.30 కోట్లతో పూర్తి చేశారని, వేసవిలో త్రాగునీరు అందించే విధంగా రిజర్వాయర్ నీ పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారని, 46వ డివిజన్ లో 500kl కెపాసిటీ గల రిజర్వాయర్ 90%పనులు పూర్తి చేశారని తెలిపారు.
8.32 కోట్ల తో గద్దె వెంకట్రామయ్య నగర్ నుండి నందమూరి నగర్ వరకు 1500kl కెపాసిటీ రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టారని,
15 వ డివిజన్ లో రామ లింగేశ్వర నగర్ లో 4 కోట్లతో 1500kl కెపాసిటీ రిజర్వాయర్ నిర్మించారని, ఇప్పటికే 90%పనులు పూర్తి అయ్యాయని,
క్రీస్తురాజుపురం కొండ ప్రాంతంలో 4కోట్లతో 200 కెనాల్ కెపాసిటీ glsr త్వరలోనే పూర్తి చేస్తారని, అమృత్ లో 83.74 కోట్లతో 18.64 కిమీ నీటి సరఫరా కోసం రెహమాన్ పార్క్ లో, గుణదల కార్మెల్ నగర్ లోన ,మున్సిపల్ ఎంప్లాయీస్ లేఔట్ లో 4 రిజర్వాయర్లు కట్టారని,
45 mlt ఫిల్ట్రేషన్ పనులు పురోభివృద్ధిలో ఉన్నాయని అన్నారు.
30 వ డివిజన్ లో దావు బుచ్చయ్య కాలనీలో 1.5 కోట్లతో 4.5 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారని. 3.29 కోట్లతో 3 కిమీ పైపింగ్ లైన్ పనులు చేపట్టారని,
14.16 కోట్లతో 3 నియోజక వర్గాలు డ్రైనేజీ లను నిర్మించారని, 1.9 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ 33.54 కిమీ నిర్మాణ పనులు చేపట్టారని, 6కోట్లతో విద్యాధర పురంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నారని అన్నారు.
17.4 కోట్లతో 320 మీటర్ల పొడవుతో రైల్వే అండర్ బ్రిడ్జిని నీ మధురానగర్ లో ప్రారంభించి, ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారని,
డాగ్ కెన్నెల్స్,పిగ్ షెడ్ లు ఏర్పాటు చేశారని,
అమృత్ 2.0 ఫైనాన్స్ కమిషన్ లో elsr,dlsr పనులు,74.36 కోట్లతో 25%పనులు పూర్తి చేశారని, 3 నియోజక వర్గాల్లో 73 కోట్లతో పార్కులు, కెనాల్ సుందరీకరణ చేశారని, 12000 టన్నుల చెత్తని మూడు ప్రధాన కాలువల్లో నుండి తీశారని తెలిపారు.
ఆస్తి పన్నులు 109.23 కోట్ల ఆస్తి పన్ను ఈ సం. వసూలు అయింది.ఖాళీ స్థలాల పన్ను 9.80 కోట్లు వసూలు అయిందని,
18.46 కోట్లు నీటి పన్ను వసూలు అయింది. సేవేజ్ చార్జెస్ 18కోట్లు వసూలు అయిందని,
6.59 కోట్లు వాటర్ మీటర్ ఛార్జీలు వసూలు చేశారని,
మొత్తం 163.8 కోట్లు రెవిన్యూ ఆదాయం 2024 కి గానూ వచ్చిందని తెలిపారు.
పట్టణ ప్రణాళిక లో 1216 దరఖాస్తులు రావడంతో వీటిపై ఆదాయం రూ.561301746
లేఔట్ రెగ్యులరీ్సేషన్ స్కీం 2020 లో భాగంగా 26కోట్ల 25లక్షల ఆదాయం వచ్చిందని,
NTR పెన్షన్ 67117 మందికి రూ.28కోట్ల 84లక్షలు ఇచ్చారని,
కారుణ్య నియామకం ద్వారా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, పార్కులు, షాపులు, కళ్యాణ్ మండపాలు, కమ్యూనిటీ హాల్,ఆడిటోరియం, కర్మల భవన్ ల నుంచి 19.20 కోట్లు వచ్చిందని తెలిపారు.
విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల క్షేమం నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఎల్లప్పుడూ పని చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసిపి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, పాల్గొన్నారు.