కార్యకర్త కుటుంబానికి పరామర్శ
34 డివిజన్ కేదారేశ్వరపేట లో బిజెపి కార్యకర్త ప్రమాదవశాత్తు డాబా పై నుండి కింది పడి మృతి చెందాడు.
బిజెపి సీనియర్ నాయకులు షేక్ మస్తాన్ తనయుడు షేక్ మామ్ జి (32) మెడికల్ కంపెనీలో జాబ్ చేస్తూ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
బుధవారం ప్రమాదవశాత్తు తన ఇంటి డాబా పైనుంచి కిందపడి మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, 34వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్ తో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కూటమినేతలు జోజి, రవికుమార్, సాంబ, ముదిగొండ శివ , గడ్డిపాటి కిరణ్ వెంట ఉన్నారు..