14-6-2025
57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేట ని అభివృద్ధి చేస్తూ న్యూ రాజరాజేశ్వరి పేట జామ తోట నుండి ఇంద్రా నాయక్ నగర్ ను కలిపే విధంగా ఒక ఫ్లై ఓవర్, న్యూ రాజరాజేశ్వరి పేట నుండి పశ్చిమ నియోజకవర్గం పాత రాజరాజేశ్వరి పేటకు వెళ్లే దారిలో ఉన్నటువంటి రైల్వే గేట్ కు RUB ని త్వరలోనే తీసుకుని వచ్చి ప్రజలకు అందిస్తాం -MLA బొండా ఉమ
ధి:14-6-2025 శనివారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేట రైలుగేట్ వద్ద ఔట్వాల్ డ్రైనేజ్ ₹45 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 2024 లో అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకుందని, ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో NDA కూటమి ప్రభుత్వం ఏర్పడి నిన్నటితో ఏడాది పూర్తయిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు సూపర్ సిక్స్ ” తల్లికి వందనం” పథకం ద్వారా ₹10 వేల కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లి అకౌంట్లో జమ చేయడం జరిగిందని, నియోజకవర్గాన్ని ఇప్పటికే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకొని ₹240కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని ఇప్పటికే 80 శాతం పనులు పూర్తిచేసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నాయని…
ప్రతిరోజు నియోజకవర్గంలోని 21 డివిజన్ లలో నూతన, సీసీ రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి, డ్రైనేజీ పనులు వేగవంతం చేసి శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తున్నామని, ఈరోజు 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో గత 2014 నుండి 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత వచ్చినటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదని
పేదవారు, డైలీ కూలి పనులకు వెళ్లేవారు అధికంగా నివసించే ఈ ప్రాంతం లో 2014 గతంలో పాకలతో నివసించే సమయంలో అగ్నిప్రమాదవశాస్తూ ప్రజలు నివసించే పాకలు దగ్ధం అవడంతో, అప్పటి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించి వీరికి పెట్టుకో ఇల్లు కట్టివ్వాలని తక్షణమే ఆదేశించగా బ్యాంకు రుణాలతో కూడినటువంటి ఇళ్లను కట్టించి ఈ ప్రాంతవాసులు నివసించే విధంగా చర్యలు చేపట్టామని, తిరిగి మళ్లీ 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాంత వాసులకు చిరకాల కలయినటువంటి న్యూ రాజరాజేశ్వరి పేట నుండి 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లే దారి మధ్యలో ఉన్నటువంటి రైల్వే గేటు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పడుతూ పడిన ప్రతిసారి అరగంటకు పైన ఎదురుచూడాల్సినటువంటి దుస్థితి వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని, మొన్ననే ఈ సమస్యను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) , నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను ఈ సమస్యను సంబంధిత రైల్వే DRM గారితో అధికారుల దృష్టి కి తీసుకొని వెళ్లి ఒక సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఎక్కడైతే RUB లు, ROB లు ఏర్పాటుకు సెంట్రల్ రైల్వే మినిస్టర్ దృష్టికి తీసుకొని వెళ్లారని సెంట్రల్ నియోజకవర్గంలో మధురానగర్ మరియు న్యూ రాజరాజేశ్వరి పేట నందు రైల్వే అండర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తామని…
గతంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో 7 ఫ్లై ఓవర్లను ప్రతిపాదించి టెండర్లను కూడా పిలిచామని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిని నిర్మించకుండా గాలికి వదిలేసిందని, అదేవిధంగా ఇక్కడ న్యూ రాజరాజేశ్వరి పేట నుండి సింగ్ నగర్ కు వెళ్ళటానికి బుడమేరు కాలువ పైన ఏర్పాటు చేసినటువంటి కనెక్టింగ్ బ్రిడ్జి గత 2014 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అని, ఈ వంతెన ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని కానీ ఈరోజు పెరిగిపోయినటువంటి ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని ఇందిరా నాయక్ నగర్ నుండి నేరుగా న్యూ రాజరాజేశ్వరి పేట జామ తోట వరకు బుడమేరు వంతెన నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని
ఈ ప్రతిపాదనలన్నీ మినిస్టర్ నారాయణ దృష్టికి, సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా ఏర్పాటు చేస్తామని, న్యూ రాజరాజేశ్వరి పేట జామ తోట నుండి ఇంద్రా నాయక్ నగర్ ను కలిపే విధంగా ఒక ఫ్లై ఓవర్ ను ఏర్పాటు చేస్తామని ఈరోజు ఔట్వాల్ డ్రైనేజ్ ₹45 లక్షల రూపాయల తో పనులు ప్రారంభించామని తెలియజేసారు
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎరుబోతు రమణ రావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి కిలాని సతీష్, బోని సన్యాసిరావు, దేవర సత్యనారాయణ, శృతి, అప్పలనాయుడు, నాగుల్ మీరా, మచ్చ ఇమ్మానుయేల్, కట్ల వేణు, శివ కుమార్ NSR, సొంటి ఈశ్వరి, సాయి, తిరుపతి, గీత, తదితరులు పాల్గొన్నారు