స్మశాన వాటికలో ఉన్న మరమ్మతులున్ని పూర్తి చేయాలి

0

 విజయవాడ నగరపాలక సంస్థ

27-02-2025

 స్మశాన వాటికలో ఉన్న మరమ్మతులున్ని పూర్తి చేయాలి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

 స్మశాన వాటికలో ఉన్న మరమ్మతులన్నీ పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం కండ్రిక జంక్షన్,ఇన్నర్ రింగ్రోడ్ వద్దగల హిందువుల, ముస్లింల, క్రైస్తవుల స్మశాన వాటికలన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

 ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్మశాన వాటికలో కావలసిన సౌకర్యాలన్ని ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న సౌకర్యాల్లో ఎటువంటి మరమ్మతులు ఉన్నా త్వరితగతిన పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని. ప్రజలకు అవసరమయ్యే మరుగుదొడ్లు , నీటి సరఫరా, షెడ్ ఏర్పాటు చేయాలని, ప్రాంతం మొత్తం పరిశుభ్రంగా ఉంచుటకు పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు.    

 ఈ పర్యటనలో ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version