10-12-2024
సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట వరం
పేదలకు అన్ని విధాలా తెలుగుదేశం ప్రభుత్వం అండ
ధి:10-12-2024 మంగళవారం సాయంత్రం 6:30″గం లకు” సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోంది అని నియోజకవర్గం లోని 23వ డివిజన్ సూర్యారావు పేట కు చెందిన ఆలపాటి సుజాత కి ₹1,30,000, కంటిబోయిన జానకి ₹75,000, లంకా రవణమ్మ ₹35,000, కొంగటి ప్రసాద్ 43,000 CMRF చెక్కులను ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయనిది పేదలకు వరంలా మారింది అని…
అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని..
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అన్నారు…
ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు..
ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, సెంట్రల్ MLA బొండా ఉమ కి, తెలుగుదేశం ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో:-కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ ,తుమ్మలపెంట శ్రీనివాస్, ఆలపాటి రాము పాల్గొన్నారు.