సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టాపొందిన అనాకొణిదెల

0

 సింగపూర్ యూనివర్సిటీలో మాస్టర్స్ పట్టాపొందిన  అనాకొణిదెల

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన అధ్యక్షులు  పవన్ కళ్యాణ్  సతీమణి శ్రీమతి అనే కొణిదెల  సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. శ్రీమతి అనా కి ఇది రెండో మాస్టర్స్ డిగ్రీ. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా స్వీకరించారు. ఆగ్నేయాసియా దేశాల కళలు, సామాజిక విజ్ఞానం (ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్) లో ఆమె ఈ మాస్టర్స్ చేశారు. మాస్టర్స్ పట్టా పొందినందుకు సతీమణికి  పవన్ కళ్యాణ్  అభినందనలు తెలిపారు.

శ్రీమతి అనా కొణిదెల  రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో చదివారు, అక్కడ ఓరియంటల్ స్టడీస్ లో హానర్స్ పట్టా పొందారు. ఆసియా దేశాల చరిత్ర భాషలు, జీవన విధానంపై అధ్యయనానికిగాను తొలుత డిగ్రీ పొందారు, ఆ అధ్యయనంలో థాయిలాండ్ చరిత్ర ఒక ప్రత్యేక సబ్జెక్ట్ గా ఉంది. సెయింట్ పీటర్స్ బర్గ్ స్టేట్ యూనివర్శిటీలో ఉండగానే మూడు భాషలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత బ్యాంకాక్ లోని చులాలాంగ్ కార్న్ యూనివర్సిటీ నుంచి థాయ్ స్టడీస్ లో శ్రీమతి అనా గారు మొదటి మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version