విజయవాడ / తిరుపతి, 2025 జూలై 27
విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
విజయవాడ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 6.30 నుండి రాత్రి 9 గంటల వరకు యాగశాలలో కుంభ రాధనలు, అభి మంత్రణము, కళాపకర్షణ, ఉక్త హోమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.