*ప్రచురణార్థం* 19-12-2024
విజయవాడలో లెటెస్ట్ ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి
కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరీకి ఎంపి కేశినేని శివనాథ్ విజ్ఞప్తి
పి.ఎమ్.కె.వి.వై కింద శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై వినతి పత్రం అందజేత
కేంద్ర సహాయ మంత్రిని ఆకట్టుకున్న ఎంపి కేశినేని శివనాథ్ ప్రతిపాదన
నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకి ఆదేశాలు
ఢిల్లీ : ఆటో మొబైల్ రంగంలో అసంఘటిత సెక్టార్స్ లో పని చేస్తున్న లక్ష మంది కి పైగా కార్మికులకి
మారిన సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యం పెంచుకునే విధంగా లెటెస్ట్ ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయించి ఆర్గనైజడ్ సెక్టార్స్ తో శిక్షణ ఇప్పించాలని కోరుతూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి జయంత్ చౌధరీ కి వినతి పత్రం అందజేశారు.
ఎంపి కేశినేని శివనాథ్ గురువారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరీ ను ఆయన కార్యాలయంలో కలిసి విజయవాడ లోని ఆటో మొబైల్ రంగంలో అసంఘటిత సెక్టార్స్ లో పని చేస్తున్న ఆ లక్ష మంది కార్మికుల ప్రయోజనం కోసం లెటెస్ట్ ఆటోమొబైల్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు పై అంశంపై చర్చించారు. ఇందుకు విజయవాడ లో పి.ఎమ్.కె.వి.వై పథకం కింద వున్న ఒక సిల్క్ డెవలప్ మెంట్ సరిపోదని తెలిపారు. ,
ఆటోమొబైల్ రంగంలో వస్తున్న సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా ఆటోనగర్ లో మెకానిక్స్, వర్కర్స్ అప్ గ్రేడ్ అయ్యేందుకు దాదాపు లక్షమంది కార్మికులకి లెటెస్ట్ ఆటోమొబైల్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. ఈ సెంటర్స్ ఏర్పాటు చేస్తే ఆ లక్ష మంది కార్మికులకు ఉపయోగకరంగా వుండటమే కాకుండా, ఈ రంగం వైపు యువత ఉపాధి అవకాశాలు ఎంచుకోవటానికి అవకాశం వుంటుందన్నారు.
కియా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి ప్రముఖ భారీ వాహన కంపెనీలు విజయవాడ ప్రాంతంలో వాటి కార్యకలపాలను విస్తరిస్తున్నాయి. ఇందుకోసం కార్మికులకి మెకానికల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, BS6 వెహికల్ డయాగ్నోసిస్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్స్, పెయింట్, కోటింగ్ టెక్నాలజీ, ఆటో ఎలక్ట్రిక్ వెహికల్ ట్రైనింగ్ (భారీ వాహనాలకు) , లెటెస్ట్ డయాగ్నోస్టిక్ టూల్స్ అంశాలపై శిక్షణ అందించి నైపుణ్యం పెంచేందుకు, లెటెస్ట్ ఆటోమొబైల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం వుందని తెలిపారు.
ఎంపి కేశినేని శివనాథ్ చేసిన విజ్ఞప్తి కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరీను బాగా ఆకట్టుకుంది. తక్షణం సంబంధిత అధికారులకు ఈ అంశం పై నాలుగు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపి కేశినేని శివనాథ్ కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌధరీ కృతజ్ఞతలు తెలిపారు.