Home Political news లంకా దినకర్ ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి విలేకరుల సమావేశం,

లంకా దినకర్ ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి విలేకరుల సమావేశం,

2
0

 లంకా దినకర్ ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి విలేకరుల సమావేశం,

17 జూలై 2024, ఏపీ బీజేపీ కేంద్ర కార్యాలయం, విజయవాడ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైకాపా పాలనలో భూ ఆక్రమణలు మరియు కబ్జాల పైన విడుదల చేసిన శ్వేతపత్రం వాస్తవాలను తెలియజేసింది.

“ భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైకాపా పాలన “

వైకాపా నాయకులు మూడు రాజధానులని మభ్య పెట్టి మూడు ప్రాంతాలలో అన్ని రకాల భూముల దోపిడీ చేశారు.

గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో ప్రభుత్వ, అటవీ, దేవాలయ మరియు ప్రజల స్వార్జిత భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి.

నీతి అయోగ్ డ్రాఫ్ట్ సూచనలను పక్కదోవ పట్టిస్తూ జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ప్రజల మరియు ప్రభుత్వ భూముల రక్షణ కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనను ఆహ్వానిస్తున్నాం.

వైకాపా పాలనలో లక్షల ఎకరాల పేదల డీకే భూముల దోపిడీకి తెరలేపారు, దీని పైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

చుక్కల భూములు 22ఏ క్రింద చూపుతూ వాస్తవ యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు, ఈ సమస్య పరిష్కారం సత్వరం అవసరం.

చుక్కల భూముల సమస్య ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు చాల ఎక్కువ ఉంది.

గత అయిదు సంవత్సరాలలో రాష్ట్రంలో వేలది ఎకరాలకు పైగా దేవాలయాల భూముల రికార్డులు తారుమారు చేశారు.

సింహాచలం దేవాలయ భూములను అన్యాక్రాంతం చేశారు.

సింహాచలం దేవాలయ గెస్ట్ హౌస్ లో తమిళనాడు నుండి వచ్చిన కార్తీక్ సుందర రాజన్ అనే వ్యక్తి దేవాలయల భూముల రికార్డులను తారుమారు చేసిన ఆరోపణలు ఉన్నాయి

అన్నవరం, ఇంద్రకీలాద్రి దేవాలయాల భూముల అక్రమణ, కబ్జాదారుల కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.

తిరుపతిలోని హాదిరాం మఠం భూములు గందరగోళం అయ్యాయి.

రాష్ట్రంలో ప్రతి దేవాలయం భూముల రికార్డులను పరిశీలించి కబ్జాలకు గురైన, అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తేవాల్సి ఉంది.

పేదలకు ఇండ్ల పట్టాలని రాజమండ్రి ఆవ భూములు, కాకినాడ మడ అడవుల అక్రమాలు మాదిరిగానే రాష్ట్రం మొత్తం జరిగిన వైకాపా అవినీతి చిట్ట బయట పెట్టి దోషులను శిక్షించాలి.

నాడు వైకాపా ప్రజాప్రతినిధులు బెదిరింపులతో విశాఖపట్నంలో భూముల డెవలప్మెంట్ అగ్రిమెంట్ల పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, వాటి పైన చర్యలు తీసుకోవాలి.

ఉత్తరాంధ్రలో ఋషి కొండని బోడి గుండు చేసి, మానస్ ట్రస్ట్ భూముల దోపిడీకి కన్నేసిన దురాక్రమణలను వైకాపా నాయకులు చేశారు.

కోస్తాలో ఒంగోలులో దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, విజయవాడ, గుంటూరులో పైవేట్ ఆస్తులు కబ్జాలు, నెల్లూరులో క్వాట్జ్, సిల్లికా సంపదను దోచేశారు.

రాయలసీమలో ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు అస్మదీయులకు జగన్ కట్టబెట్టారు.

గత అయిదు సంవత్సరాలుగా ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ క్వారీలను చిన్నాభిన్నం చేశారు.

జగన్ స్వంత జిల్లా కడపలో లో బెరైటీస్, సున్నపు రాయి త్రవ్వకాల అక్రమాలు ఆకాశాన్ని తాకాయి.

సహజ వనరులతో రాష్ట్రా సర్వతో ముఖాభివృద్ధిని పక్కన పెట్టి అనునాయులకు సర్వ సంతర్పణ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది.

వైకాపా పార్టీ ఆఫీసుల కోసమని జిల్లాకొక ప్యాలెస్ నిర్మాణం కోసం అక్రమ భూ కేటాయింపులు చేసి దేశంలో రాజకీయ పార్టీ ఆఫీసుల నిర్మాణంలో అవినీతి రికార్డు సృష్టించిన జగన్ .

వైకాపా పార్టీ ఆఫీసులు కట్టుకోవడం తప్పు కాదు, ప్రభుత్వ భూములను కేటాయించిన తీరు చూస్తే రాచరిక విధానం ప్రతిబింబిస్తుంది.

గుజరాత్ రాష్ట్రంలోని ల్యాండ్ మాఫియాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ భూములను అక్రమంగా ఆక్రమణలు చేయడం మరియు భూ కబ్జాలను ఎదుర్కోవడానికి గుజరాత్ ప్రభుత్వం “ గుజరాత్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టం, 2020 (“చట్టం”)” ను రూపొందించింది.

ఈ చట్టం భూఆక్రమణలు, కబ్జాలు చట్ట విరుద్ధమని ప్రకటించడమే కాకుండా వాటిని నేరాల పరిధిలోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త చట్టం ద్వార భూ ఆక్రమణలు, కబ్జాల విచారణ కోసం, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం జరిగింది, దీని అధికార పరిధి కేవలం భూ కబ్జాకు సంబంధించిన క్రిమినల్ కేసులకు మాత్రమే పరిమితం కాకుండా సివిల్ పరిష్కారాలను అందించడానికి కూడా అవకాశం కల్పించింది.

ఈ చట్టం భూమి కబ్జా కేసులను ఆరు నెలల్లోపు త్వరితగతిన పరిష్కరించేందుకు, నిజమైన యజమాని ప్రయోజనాలను పరిరక్షించడానికి తేవడం జరిగింది.

జగన్ వైకాపా భూ అక్రమ మార్కు పాలన ప్రభుత్వ పారదర్శకతకు పాతర వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here