ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి, ప్రముఖ వితరణశీలి, రచయిత సుధామూర్తి (73) ఇవాళ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆమెను ఇటీవల ఉమెన్స్ డే (మార్చి 8) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే.
ఇవాళ తన భర్త నారాయణమూర్తి సమక్షంలో సుధామూర్తి ప్రమాణం చేశారు. పార్లమెంటు హౌస్ లోని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ చాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. సుధామూరి ప్రమాణస్వీకారం సందర్భంగా రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పియూష్ గోయల్ కూడా అక్కడే ఉన్నారు.
ఇంజినీర్ గా ప్రస్థానం ప్రారంభించి, ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ గానూ వ్యవహరించిన సుధామూర్తి, రచయితగా కన్నడ, ఆంగ్ల భాషల్లో అనేక పుస్తకాలు రచించారు.
గతంలో ప్రభుత్వ రంగ సంస్థ టెల్కోలో ఇంజినీర్ గా పనిచేసిన సుధామూర్తి… తన భర్త నారాయణమూర్తి ఇన్ఫోసిస్ ప్రారంభించే సమయంలో ఆమె రూ.10 వేలు సాయంగా అందించారు. ఇప్పుడదే ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 80 బిలియన్ డాలర్లకు పైమాటే.
ఇక, సుధామూర్తి-నారాయణమూర్తి దంపతుల కుమార్తె అక్షత… బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అని తెలిసిందే.
Spread the love గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత దుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ […]
Spread the love రాయల్ బ్రిస్బేన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేమూరు ఉజ్వల ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన వైనం ప్రమాదవశాత్తూ కాలు జారడంతో లోయలో పడి దుర్మరణం మృతదేహాన్ని భారత్కు […]
Spread the love చైనాలో పనికోసం వెళ్లిన పాలమూరు వాసి ఒకరు అక్కడ గుండెపోటుతో కన్నుమూశాడు. మరో నాలుగు రోజుల్లో భారత్ కు తిరిగి రావాల్సి ఉండగా అంతలోనే మరణించాడు. మహబూబ్ నగర్ జిల్లా […]