15-08-2024
మహనీయుల ప్రాణత్యాగ ఫలితమే స్వాతంత్య్రం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఎంపి కార్యాలయంలో ఘనంగా పంద్రాగష్టు వేడుకలు
జాతీయ పతాకం ఎగరవేసిన ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ : బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగపూరితమైన పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ భవన్ ఆవరణలో ఎంపి కేశినేని శివనాథ్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలందరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వామలు కావటంతో ఎంతో సంతోషంగా వుందన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజల్లోని దేశభక్తి మాత్రమే కాదు భారతీయుల ఐక్యత, శక్తిని ప్రపంచానికి తెలియజేసిందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు , కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి , టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్ బేగ్, ఎరుబోతు రమణారావు, మాదిగాని గురునాథం , పుల్లగూర చరణ్ సాయి యాదవ్ , పీతా బుజ్జి గారు, కొణిజేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.