బొండా ఉమా మాట్లాడుతూ;- భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కాలుష్యాన్ని నివారించాలి అని కాలవగట్లు నూతనీకరణ చేస్తూ వృద్ధులకు పిల్లలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అని
11-7-2024 గాంధీ నగర్
ది:11-7-2024 గురువారం ఉదయం 10:00″గం లకు”విజయవాడ గాంధీ నగర్ “GS”రాజు రోడ్డు రైతు బజార్ దగ్గర విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో, పర్యావరణం పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం అయినది
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా;- సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు విచ్చేసి స్వయంగా మొక్కలు నాటడం జరిగినది.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ;- భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ కాలుష్యాన్ని నివారించాలి అని కాలవగట్లు నూతనీకరణ చేస్తూ వృద్ధులకు పిల్లలకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అని
రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఐదు కోట్ల మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినదని , దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గాంధీనగర్ హనుమాన్ పేట ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి భావితరాలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని నేడు ఉన్నటువంటి పరిస్థితులలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయని…
ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభిస్తున్న టువంటి ఈ కార్యక్రమం అన్ని డివిజన్ లలో, అన్ని సెంటర్ లలో, పేదవారు నివసిస్తున్న ప్రాంతాలలో ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు ఒక్క మొక్కైనా నాటి మన ఆరోగ్యాన్ని ప్రకృతిని కాపాడుకోవాలి అని బోండా ఉమా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో;- నగరపాలక సంస్థ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవతి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వర్లు, చలమల శెట్టి శ్రీనివాస్, ఇమ్మిడి రాము,బాబి,బోను సుందరయ్య, బోను బ్రదర్స్, నగరపాలక సంస్థ నాగేశ్వరరావు,సరదా,లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు