బాధిత కుటుంబానికి 3.5
లక్షల ఎల్ .ఓ . సీ అందజేత
కూటమి నేతలతో కలిసి అందజేసిన టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, కార్యాలయ
కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన
(లెటర్ ఆఫ్ క్రెడిట్)
ఎల్.ఓ.సి ను
శనివారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్ , కూటమి నేతలతో కలిసి
అందజేశారు.
54 వ డివిజన్, వించి పేటకు కు చెందిన బొత్స సూరేకాంతం (60) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
తనకి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ .ఓ. సీకొరకు దరఖాస్తు చేశారు.
మంజూరైన రూ 3.5 లక్షల
ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితురాలి కుమారుడు దుర్గారావు కు అందజేశారు
త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోగంటి రామారావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు దొడ్ల రాజా, కొల్లి దుర్గారావు, సప్పా శ్రీనివాస్, జ్యోత్స్న ప్రియ పాల్గొన్నారు.